sharwanand: కథ వినగానే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేశాను: శర్వానంద్

  • కథను నమ్మే నిర్మాత ఖర్చు పెట్టారు
  • ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం
  • ఆడియన్స్ తోపాటు ఇళ్లకి వెళ్లే కథ  

'మహానుభావుడు' వంటి ప్రేమకథా చిత్రం తరువాత శర్వానంద్ .. 'ఫిదా' వంటి లవ్ స్టోరీ తరువాత సాయిపల్లవి చేస్తోన్న మరో ప్రేమకథా చిత్రమే 'పడి పడి లేచే మనసు'. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించిన విశేషాలను శర్వానంద్ పంచుకున్నాడు.

"చాలామంది కాంబినేషన్ ను బట్టి సినిమాలు చేస్తుంటారు .. కథను నమ్మి సినిమాలు చేసే వాళ్లు చాలా తక్కువ. అలాంటివారిలో ఈ సినిమా నిర్మాత ఒకరు .. ఆయనకి నేను హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ఇండస్ట్రీకి ఇలాంటి నిర్మాతలు చాలా అవసరం. ఇక దర్శకుడు హను రాఘవపూడి కథ చెప్పగానే 'ఈ సినిమా బ్లాక్ బస్టర్ .. రాసి పెట్టుకో' అని చెప్పాను. కొన్ని ప్రేమకథా చిత్రాలు ఆడియన్స్ తోపాటు వాళ్ల ఇళ్లకి వెళ్లిపోతాయి. నాగార్జున 'గీతాంజలి' .. 'సఖి'.. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' వంటి సినిమాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఆ దృశ్య కావ్యాల సరసన 'పడి పడి లేచె మనసు' కూడా నిలిచిపోతుంది" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News