Rajasthan: జేబులో పేలిన మొబైల్ ఫోన్.. మంటలు అంటుకుని వృద్ధుడి సజీవదహనం!

  • రాజస్తాన్ లోని నెతావల్ గఢ్ లో ఘటన
  • చవక ఫోన్లను అందించిన ప్రభుత్వం
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఏదో చేయాలని అనుకుంటే ఇంకేదో కావడం అంటే ఇదే. చవకగా ఫోన్లు అందజేసి ప్రజల మద్దతును పొందుదామని అనుకున్న రాజస్తాన్ ప్రభుత్వానికి షాక్ ఎదురయింది. ప్రభుత్వం అందజేసిన ఫోన్ ఒకటి ఓ పెద్దాయన(60) జేబులోనే పేలిపోవడంతో మంటలు అంటుకుని ఆ వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన రాజస్తాన్ లోని నెతావల్ గఢ్ పరిధిలో చోటుచేసుకుంది.

రాజస్తాన్ లోని పాచ్లీ గ్రామంలో ఓ వృద్ధుడు ఇటీవల రాజస్తాన్ ప్రభుత్వం రూ.1100 కు అందజేసిన ఫోన్ ను కొన్నాడు. కాగా, ఈ ఫోన్ ను బనియన్ జేబులో పెట్టుకుని వెళుతుండగా నిన్న రాత్రి ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆయన మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యాడు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News