kcr: టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

  • కేసీఆర్ ని ఎన్నుకున్న 88 మంది ఎమ్మెల్యేలు
  • కొద్దిసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్న కేసీఆర్
  • తీర్మాన ప్రతిని గవర్నర్ కు అందజేయనున్న కేసీఆర్

టీఆర్ఎస్ఎల్పీ నాయకుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన 88 మంది ఎమ్మెల్యేలు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవ తీర్మాన ప్రతిని కొద్ది సేపట్లో నరసింహన్ కు కేసీఆర్ అందజేయనున్నారు. రాజ్ భవన్ కు కేసీఆర్ తో ఇతర నేతలు కూడా వెళ్లనున్నారు.

కాగా, రేపు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్, మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశం ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రొటెం స్పీకర్ గా రెడ్యా నాయక్ ను నియమించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. 

More Telugu News