mallikarjun: మా పెళ్లి గురించి తెలియగానే బాలూ గారు అలా అన్నారు: సింగర్ గోపికా పూర్ణిమ

  • మా పెళ్లికి అమ్మానాన్నలు అంగీకరించారు 
  • ఒక రోజున బాలూగారు ఫోన్ చేశారు 
  • ఆయనతో చాలా ఈవెంట్స్ కి వెళ్లాము

సింగర్ మల్లికార్జున్ .. గోపికా పూర్ణిమ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఈ జంట పాల్గొన్నారు. అప్పుడు ఆలీ నుంచి "మీ ఇద్దరూ లవ్ చేసుకునే సమయంలో ఒకసారి బాలూగారి దృష్టిలో పడగా ఆయన వార్నింగ్ ఇచ్చారట నిజమేనా?" అనే ప్రశ్న ఎదురైంది.

అందుకు గోపీకా పూర్ణిమ స్పందిస్తూ .."అలాంటిదేం లేదు .. బాలూగారితో కలిసి చాలాకాలం పాటు మేమిద్దరం ట్రావెల్ చేశాము. చాలా ఈవెంట్స్ కి ఆయన మమ్మల్ని తీసుకెళ్లారు. మా అమ్మానాన్నలు మా పెళ్లికి ఒప్పుకున్న తరువాత, ఈ విషయం తెలిసి బాలూగారు మా నాన్నగారికి ఫోన్ చేశారు. 'మాములుగా నా ఒళ్లంతా కళ్లు .. ఎక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా నేను వెంటనే పసిగట్టేస్తాను. అలాంటిది వీళ్లు ఎక్కడా నా కంటపడలేదు .. అంత చక్కగా బిహేవ్ చేశారు.. నాకు చాలా సంతోషంగా వుంది' అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు అని చెప్పుకొచ్చింది.       

More Telugu News