mallikarjun: ఒకే పాటతో సినిమా పరిశ్రమకి పరిచయమయ్యాం: సింగర్ గోపికా పూర్ణిమ

  • గోపికా పూర్ణిమను అక్కడే చూశాను
  • మా పరిచయం స్నేహంగా మారింది
  • వందేమాతరంతో కలిసి పాడాము

గాయనీ గాయకులుగా మల్లికార్జున్ .. గోపికా పూర్ణిమలకి మంచి గుర్తింపు వుంది. తాజాగా ఈ దంపతులు 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మల్లికార్జున్ మాట్లాడుతూ .. "నేను సారథి స్టూడియోలో ఉండగా 'పాడుతా తీయగా'లో పాడటానికి గోపికా పూర్ణిమ వచ్చింది. అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ కి వచ్చాను .. తను టెన్త్ క్లాస్ లోకి వచ్చింది.

సారథి స్టూడియోలో జరిగిన మా పరిచయం .. ఆ తరువాత స్నేహంగా మారింది. ఆ స్నేహం మాకు తెలియకుండానే ప్రేమగాను మారింది" అని అచెప్పాడు. అప్పుడు గోపికా పూర్ణిమ మాట్లాడుతూ .."మేమిద్దరం ఒకే పాటతో సినిమా పరిశ్రమకి పరిచయం కావడం విశేషం. ఆర్.నారాయణమూర్తి 'సింగన్న' సినిమా కోసం మమ్మల్ని వందేమాతరం శ్రీనివాస్ గారు పిలిపించారు. ఆయనతో కలిసి మేము మొదటి పాట పాడాము. అక్కడి నుంచే మా సినిమా ప్రయాణం మొదలైంది" అని చెప్పుకొచ్చింది. 

More Telugu News