charan: 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో చరణ్ మెగా ఫైట్

  • ముగింపు దశలో చరణ్ మూవీ 
  • భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు      

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' సినిమా రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఇటీవలే ఈ సినిమా కోసం ఒక భారీ యాక్షన్ ఎపిపోడ్ ను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. విశ్రాంతికి ముందు ఈ ఫైట్ సీన్ రానున్నట్టుగా తెలుస్తోంది.

కథా పరంగా చాలా కీలకమైన సందర్భంలో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ కావడంతో, ఈ యాక్షన్ ఎపిసోడ్ ను ఒక రేంజ్ లో చిత్రీకరించారట. చరణ్ తో పాటు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా ఈ యాక్షన్ ఎపిసోడ్ ను బోయపాటి తనదైన శైలిలో చిత్రీకరించినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ సీన్ నిలవనుందని అంటున్నారు. మెగా అభిమానుల చేత విజిల్స్ వేయించేలా ఉంటుందని చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.      

More Telugu News