Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. కృష్ణా జలాలపై పిటిషన్ కొట్టివేత!

  • గతంలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
  • కర్ణాటక, మహారాష్ట్రలను కూడా చేర్చాలని వినతి
  • ఏపీ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించిన విచారణలో తమతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ వాదనలు వినాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ కేసులో మహారాష్ట్ర, కర్ణాటకల వాదనలు వినాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఉమ్మడి ఏపీ 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయినందున ఈ రెండు రాష్ట్రాల వాదనలు మాత్రమే వింటామని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ కేసులో ఏపీ, తెలంగాణ వాదనలు వింటే చాలని ఇంతకుముందు కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. తాజాగా కోర్టు నిర్ణయంతో కృష్ణా జలాల పంపకంపై తెలుగు రాష్ట్రాల మధ్య వాదనలు కొనసాగనున్నాయి.
Andhra Pradesh
Supreme Court
krishna
water
distribution
tribunal
Karnataka
Maharashtra
Telangana
suspended
rejected

More Telugu News