Jammu And Kashmir: కశ్మీర్లో లోయలోకి జారిపోయిన బస్సు.. 23 మంది దుర్మరణం!

  • పూంచ్ జిల్లాలో ప్లేరా ప్రాంతంలో ఘటన
  • లోయలో పడి తుక్కుతుక్కయిన బస్సు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

జమ్మూకశ్మీర్ లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లోరన్ నుంచి పూంచ్ జిల్లా కేంద్రానికి వెళుతున్న బస్సు అదుపు తప్పి ప్లేరా ప్రాంతంలోని లోయలోకి జారిపోయింది. ఈ ఘటనలో 23 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడ్డ 19 మందిని అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News