India: 235కే ఆలౌట్... ఆసీస్ పై భారత్ కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం!

  • తొలి ఇన్నింగ్స్ ను ముగించిన ఆస్ట్రేలియా
  • భారత్ కు 15 పరుగుల ఆధిక్యం
  • అశ్విన్, బుమ్రాలకు చెరో మూడు వికెట్లు

అడిలైడ్ లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 235 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 191 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ ఆటగాళ్లు, మరో 44 పరుగులు మాత్రమే జోడించి, మిగతా మూడు వికెట్లనూ కోల్పోయారు.

మధ్యలో కాసేపు వరుణుడు సైతం మ్యాచ్ ని అడ్డుకున్నాడు. ఆసీస్ జట్టులో టీఎం హెడ్ ఒక్కడే 72 పరుగులతో రాణించాడు. మిగతా వారెవరూ చెప్పుకోతగ్గ స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రాలకు చెరో మూడు, ఇషాంత్ శర్మ, షమీలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. మరికాసేపట్లో ఇండియా తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.

More Telugu News