Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాకూటమి 85 స్థానాల్లో గెలుస్తుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించడం లేదు
  • ఓటింగ్ సరళిని చూస్తే ఈవిషయం అర్థమైంది
  • ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

తెలంగాణలో ప్రజాకూటమి 85 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రజలు ఎంత మాత్రం కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదని, ఓటింగ్ సరళిని చూస్తే ఈ విషయం అర్థమైందని చెప్పారు. తెలంగాణలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News