nitin gadkari: నితిన్ గడ్కరీకి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

  • అహ్మద్ నగర్ లో ఓ సభకు హాజరైన గడ్కరీ
  • వేదికపైనే సొమ్మసిల్లిన కేంద్ర మంత్రి
  • సభలో కలకలం

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఓ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వేదికపైనే ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. భద్రతా సిబ్బంది, అనుచరులు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News