telangana: సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరిగే నియోజకవర్గాలు ఇవే!

  • మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల గుర్తింపు
  • ఈ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్
  • మిగిలిన స్థానాల కంటే గంట ముందు ముగియనున్న పోలింగ్

రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతాబలగాలు కూడా అన్ని ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండే 13 నియోజకవర్గాలను గుర్తించారు. ఈ నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. అంటే ఒక గంట ముందే పోలింగ్ ముగుస్తుందన్నమాట.

ఆ 13 నియోజకవర్గాలు ఇవే: బెల్లంపల్లి, సిర్పూర్, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, మంథని, పినపాక, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట, మంచిర్యాల.

More Telugu News