BJP: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో కేసీఆర్‌ కుటుంబమే బాగుపడింది: బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి

  • రుణమాఫీపై కాంగ్రెస్‌ పిల్లి మొగ్గలు
  • కర్ణాటకలో ఏం చేశారు...పంజాబ్‌లో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్న
  • అక్బరుద్దీన్ పద్ధతి మార్చుకుంటే రాఖీ కట్టి వెళతా

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలు బాగుపడతారనుకుంటే కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ మీనాక్షి లేఖి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యల గురించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు.

ఇక కాంగ్రెస్‌ రుణమాఫీపై పిల్లిమొగ్గలు వేస్తోందని, కర్ణాటకలో ఏం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. పంజాబ్‌ రాష్ట్రంలో రూ.200 కోట్ల రుణ మాఫీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ, బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన తన పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని సూచించారు. అక్బరుద్దీన్‌ మంచిగా ఉంటే ఆయనకు రాఖీ కట్టి వెళ్తానని వ్యాఖ్యానించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.

More Telugu News