Ranga Reddy District: నలుగురు ప్రత్యర్థి నేతలు, రూ. 11 కోట్లకు డీల్... ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించిన రంగారెడ్డి జిల్లా నేత!

  • రంగారెడ్డి జిల్లాలో చేతులు మారిన కోట్లు
  • తనకు సహకరించేలా ఓ ప్రముఖ నేత డీల్
  • ప్రజల్లో కొనసాగుతున్న చర్చ

మన ఓట్లు మనకు పడతాయి... పక్క పార్టీ ఓట్లు లాగితే గెలుపు ఖాయమవుతుందన్న ఆలోచనలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నేత తన వద్ద ఉన్న ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించి, నలుగురు ప్రత్యర్థి పార్టీ నేతలను రూ. 11 కోట్లతో కొనేసినట్టు ప్రజల్లో చర్చ జరుగుతోంది.

ఆ పార్టీల్లోనే ఉండి తనకు సహకరించేలా ఒప్పందం కుదుర్చుకున్న నేత, ఒకరికి రూ. 4 కోట్లు, మరో ఇద్దరికి రూ. 2 కోట్ల చొప్పున, ఇంకొకరికి రూ. 3 కోట్లు చేరవేసినట్టు సమాచారం. ఈ ముగ్గురూ సదరు నేత విజయానికి తమవంతు సహకారాన్ని అందించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించేశారట.

ఇక మహబూబ్ నగర్ జిల్లాలో ఓ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్ ఓటును రూ. 3 వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 9 వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండటంతో, వాటిల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లను తాను సంపాదించాలని టార్గెట్ గా పెట్టుకున్న సదరు నేత, డబ్బులు వెదజల్లుతున్నారని తెలుస్తోంది.

More Telugu News