KTR: సన్యాసం తీసుకున్నా నీకు విలాసమే: కేటీఆర్ కు ఖుష్బూ కౌంటర్

  • ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేటీఆర్
  • సన్యాసం తీసుకున్నా రూ. 300 కోట్ల భవంతిలోనే ఉంటారన్న ఖుష్బూ
  • ఆయన జీవితం విలాసవంతమేనని ఎద్దేవా

ఈ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన కాంగ్రెస్ మహిళా నేత, సినీ నటి ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆమె, కేటీఆర్ రూ. 300 కోట్లు పెట్టి విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నారని ఆరోపించిన ఆమె, ఆపై సన్యాసం తీసుకున్నా ఆ ఇంట్లోనే లగ్జరీగా ఉంటారని, ఆ ఇల్లు బులెట్ ప్రూఫ్ అని తాను విన్నానని చెప్పారు. బయటకు రావడానికి భయపడి, అంత పటిష్ఠంగా ఇల్లు కట్టుకుని దాక్కున్న కేటీఆర్, సన్యాసం తీసుకుని ఆ ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం ఖాయమన్న ధీమాను ఖుష్బూ వ్యక్తం చేశారు.

More Telugu News