ఆర్డీఎస్ లో నీళ్లు ఎలా పారుతున్నాయో.. టీఆర్ఎస్ కు ఓట్లు అలా పారాలి: సీఎం కేసీఆర్

  • ఆలంపూర్ కు డిగ్రీ కాలేజ్, ఫైర్ స్టేషన్ తీసుకొస్తాం
  • ప్రభుత్వ ఆసుపత్రిలో వందపడకలు ఏర్పాటు చేస్తాం
  • హక్కుల కోసం పోరాడే ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్
ఆర్డీఎస్ కెనాల్ లో నీళ్లు ఎలా పారుతున్నాయో.. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓట్లు అలా పారాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఆలంపూర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కౌంటింగ్ హాలులో ఓట్లు లెక్కపెడితే టీఆర్ఎస్ కు ఓట్ల వరద పారాలని, ‘కారు’ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ఆలంపూర్ లో ప్రజలు కోరిన విధంగా డిగ్రీ కాలేజ్, ఫైర్ స్టేషన్ తీసుకొస్తామని చెప్పారు. మూడు లేదా నాలుగు నెలల్లో వీటిని అమలు చేస్తామని, ఇక్కడి ఆసుపత్రిని వందపడకల ఆసుపత్రిగా మారుస్తామని అన్నారు. భగవంతుడి దయ వల్ల తెలంగాణకు సంపదకు తక్కువ లేదని, అన్నీ అమలు చేస్తామని అన్నారు. హక్కుల కోసం పేగులు తెగేలా కొట్లాడే ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ కనుక, తమ అభ్యర్థి అబ్రహాంను గెలిపించాలని కోరారు.
Go Back to Shorts
kcr
TRS
aalampur
RDS

More Telugu News