sharwanand: మనసును దోచేస్తోన్న 'కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలే' సాంగ్

  • హను రాఘవపూడి నుంచి ప్రేమకథా చిత్రం 
  • సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్ 
  • ఆకట్టుకుంటోన్న సాహిత్యం

శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచె మనసు' నిర్మితమైంది. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రాన్ని ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. "కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలే .. నను చూస్తూనే కమ్మేసేనే. కల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రైల్ .. విహరించేనా భూలోకమే" అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది.

విశాల్ చంద్రశేఖర్ కట్టిన బాణీ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. పాట రచయిత కృష్ణ కాంత్ చేసిన కొన్ని పదప్రయోగాలు బాగున్నాయి. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట మంచి ఫీల్ తో యూత్ కి కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. శర్వానంద్ - సాయిపల్లవి కాంబినేషన్ ను తెరపై చూడాలనే కోరికతో అభిమానులు వున్నారు. ఈ నెల చివరివారంతో వాళ్ల ముచ్చట తీరనుంది. 

More Telugu News