Revanth Reddy: రేవంత్ రెడ్డికి 4+4 భద్రతను కేటాయించిన పోలీసు శాఖ

  • ప్రాణహాని ఉందంటూ హైకోర్టును ఆశ్రయించిన రేవంత్
  • భద్రతా కారణాలతో ప్రచారానికి దూరం
  • హైకోర్టు ఆదేశాల మేరకు రేవంత్ కు సెక్యూరిటీ పెంపు

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి తెలంగాణ పోలీసు శాఖ 4 ప్లస్ 4 భద్రతను కేటాయించింది. రేవంత్ నియోజకవర్గం కొడంగల్ కు 2 ఎస్కార్ట్ వాహనాలు, 4 ప్లస్ 4 గన్ మెన్లను పోలీసు శాఖ పంపింది. అయితే, ఎన్నికల ఫలితాల రోజు వరకే ఈ సెక్యూరిటీ రేవంత్ కు ఉంటుంది. తనకు ప్రాణ హాని ఉందని... ఎన్నికల ప్రచారం సమయంలో మావోయిస్టు ముసుగులో తనను అంతమొందించే అవకాశం ఉందని, తనకు భద్రతను పెంచాలంటూ హైకోర్టును రేవంత్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో, రేవంత్ కు 4 ప్లస్ 4 భద్రతను కేటాయించాలని హైకోర్టు నిన్న ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఆయనకు భద్రతను పెంచడంతో పాటు, 2 ఎస్కార్ట్ వాహనాలను సమకూర్చారు. 

More Telugu News