Wines: తెలంగాణలో రెండు రోజులు మద్యం అమ్మకాలు బంద్: ఈసీ ఆదేశాలు

  • డిసెంబర్ 5 సాయంత్రం 6 గంటలకు మూత
  • తిరిగి 7వ తేదీ సాయంత్రం 6 తరువాత తెరచుకోనున్న దుకాణాలు
  • బార్లు, పబ్బులు, క్లబ్బులు కూడా మూత

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీన సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎం దానకిషోర్‌ ఆదేశించారు.

మద్యం దుకాణాలతో పాటు అన్ని బార్లు, బార్లతో కలిసుండే రెస్టారెంట్‌ లు, పబ్ లు, స్టార్‌ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్ లు మూసివేయాలని, మిలటరీ క్యాంటీన్లలో మద్యం అమ్మకాలు జరుపవద్దని ఆదేశించారు. కాగా, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నలుగురి కన్నా ఎక్కువ మంది గుమికూడటాన్ని నిషేధిస్తున్నట్టు పోలీస్‌ కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

More Telugu News