Chandrababu: కుట్రలు చేసే చంద్రబాబును నమ్మొద్దు: టీఆర్ఎస్ ఎంపీ కవిత

  • రైతులకు నీళ్లు ఆపిన బాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తా!
  • టీ-కాంగ్రెస్ నేతలను మేము పట్టించుకోము
  • ఢిల్లీలో వీళ్ల తాతలతోనే కొట్లాడాం

ఏపీ సీఎం చంద్రబాబు, టీ-కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ ఎంపీ కవిత విరుచుకుపడ్డారు.  జగిత్యాలలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, కుట్రలు చేసే చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఆమె సూచించారు. రైతులకు నీళ్లు ఆపిన బాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందని విమర్శించారు. టీ-కాంగ్రెస్ నేతలను తామేమీ పట్టించుకోమని, ఢిల్లీలో వీళ్ల తాతలతోనే కొట్లాడామని, తమకు అడ్డంపడితే తొక్కుకుంటూ వెళ్తామని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం నుంచి వచ్చిన తాము ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. 

More Telugu News