లష్కరే ఉగ్రవాది, కసబ్ సన్నిహితుడు నవీద్ జట్ హతం
- భద్రతా దళాల ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాది
- రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ను హత్య చేసింది అతడే
- 20 ఏళ్లకే కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిన వైనం
హతమైన నవీద్ జట్ కరుడుగట్టిన ఉగ్రవాది. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవడంలో దిట్ట అయిన అతడికి ఎస్కేప్ ఆర్టిస్ట్గా పేరుంది. ముంబైలో మారణహోమం సృష్టించిన కసబ్తో కలిసి లష్కరే తాయిబా శిబిరంలో శిక్షణ పొందాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా దళాలకు పట్టుబడ్డాడు. వైద్య పరీక్ష నిమిత్తం శ్రీనగర్ సెంట్రల్ జైలు నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు పోలీసులను చంపి పరారయ్యాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న నవీద్ రైజింగ్ కశ్మీర్ పత్రిక ఎడిటర్ షుజాత్ బుఖారీని హత్య చేశాడు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు.