akhil: 'అభిమన్యుడు' దర్శకుడితో అఖిల్?

  • 'మిస్టర్ మజ్ను'తో బిజీగా అఖిల్ 
  • జనవరిలో ప్రేక్షకుల ముందుకు 
  • తదుపరి ప్రాజెక్టుపై దృష్టి  

ప్రస్తుతం అఖిల్ తన మూడవ సినిమా 'మిస్టర్ మజ్ను'ను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత అఖిల్ ఏ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తమిళ దర్శకుడు 'మిత్రన్' పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

తమిళంలో ఇటీవల విశాల్ హీరోగా వచ్చిన 'ఇరుంబు తిరై' (అభిమన్యుడు) ఘన విజయాన్ని సాధించింది. దర్శకుడిగా ఈ సినిమా మిత్రన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. రీసెంట్ గా ఆయన అఖిల్ ను కలిసి ఒక లైన్ చెప్పాడట. చాలా వైవిధ్యభరితంగా అనిపించడంతో పూర్తి కథను సిద్ధం చేయమని అఖిల్ అన్నాడట. ప్రస్తుతం మిత్రన్ అదే పనిలో వున్నాడని చెబుతున్నారు. కథ నచ్చితే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో అఖిల్ వున్నాడని చెప్పుకుంటున్నారు. అఖిల్ ని మిత్రన్ ఒప్పిస్తాడో లేదో చూడాలి మరి.          

More Telugu News