akhil: 'మిస్టర్ మజ్ను' గురించి అఖిల్

  • వెంకీ అట్లూరితో అఖిల్ 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • జనవరిలో విడుదల    

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ 'మిస్టర్ మజ్ను' సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమాను గురించి అఖిల్ ట్వీట్ చేశాడు. "ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ 3వ తేదీ నాటికి ఒక్క పాట మినహా షూటింగు పూర్తవుతుంది. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయనున్నాము. నా సినిమా విషయంలో ఇంతవరకూ ఓపికగా వున్న అభిమానులకు ధన్యవాదాలు" అని ఆయన అన్నాడు.

డిసెంబర్ 3 తరువాత ఒక పాటను చిత్రీకరించి, జనవరి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అఖిల్ కి ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టవలసిన అవసరం వుంది. అందువలన నాగార్జున ఎప్పటికప్పుడు అవుట్ పుట్ ను చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.   

More Telugu News