చరణ్ సొంత బ్యానర్లో అఖిల్ సినిమా!

  • వెంకీ అట్లూరి నుంచి 'మిస్టర్ మజ్ను'
  • అఖిల్ 4వ  సినిమాపై ఆసక్తి 
  • దర్శకుడిగా తెరపైకి బోయపాటి పేరు   
'తొలిప్రేమ'తో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ను సాధించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ 'మిస్టర్ మజ్ను' సినిమా చేస్తున్నాడు. కథాపరంగా ఈ సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ విదేశాల్లో జరిగింది. సంక్రాంతికి గానీ .. ఆ తరువాత గాని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ 4వ సినిమా ఏ బ్యానర్లో .. ఏ దర్శకుడితో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది.

అఖిల్ 4వ సినిమాకి బోయపాటి దర్శకుడిగా వ్యవహరించనున్నాడనీ, ఈ సినిమా చరణ్ సొంత బ్యానర్లో రూపొందనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలోనే చరణ్ 'వినయ విధేయ రామ' చేస్తున్నాడు. ఈ సినిమా సెట్లోనే బోయపాటి .. చరణ్ కలిసి అఖిల్ ప్రాజెక్టును సెట్ చేశారని చెప్పుకుంటున్నారు. తన బ్యానర్లో ఇతర హీరోల సినిమాలను కూడా నిర్మిస్తానని ఆరంభంలోనే చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే.    
Go Back to Shorts
charan
boyapati
akhil

More Telugu News