Mahesh Babu: రైతు సమస్యలపై పోరాడే పాత్రలో మహేశ్ బాబు

  • అన్నపూర్ణ స్టూడియోలో 'మహర్షి'
  • డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు 
  • ఏప్రిల్ 5వ తేదీన భారీ విడుదల    

మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగు జరుపుకుంటోంది. ఇక్కడి అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా కోసం భారీగా విలేజ్ సెట్ వేశారు. గ్రామీణ నేపథ్యంలో రైతుల తరఫున మహేశ్ బాబు పోరాడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో అమెరికాలోని ఓ బడా సంస్థకి సీఈవో గాను .. ఇండియాలోని ఓ మారుమూల గ్రామంలోని రైతుగాను మహేశ్ కనిపించనున్నాడు. ఆల్రెడీ అమెరికాలో షూటింగును పూర్తి చేసిన టీమ్, ప్రస్తుతం రైతు నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంటర్వెల్ కి ముందు ఈ సీన్స్ వస్తాయట. దిల్ రాజు - అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News