ar rehman: పసల బేబీ స్వరానికి రెహ్మాన్ కితాబు!

  • కూలీ పాటకి స్పందించిన కమల్ 
  • ఇంటికి ఆహ్వానించి సన్మానం 
  • తాజాగా గ్రామీణ మహిళ స్వరాన్ని మెచ్చిన రెహ్మాన్

ఆ మధ్య 'విశ్యరూపం' సినిమాలోని ఒక పాటను ఒక కూలీ పాడగా, ఆ వీడియో కమల్ కంట పడటానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఆ గాయకుడిని కమల్ తన ఇంటికి పిలిచి సన్మానించాడు. అలాగే ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా వడిసాలేరుకి చెందిన పసల బేబీ అనే సాధారణ మహిళ, ఏకంగా రెహ్మాన్ నుంచే ప్రశంసలు అందుకుంది. 

ఇటీవల ఆమె పాడిన 'ప్రేమికుడు' సినిమాలోని 'ఓ చెలియా .. నా ప్రియా సఖియా' అనే పాట సోషల్ మీడియాలో సంచలనం అయింది. చాలా కష్టతరమైన ఆ పాటను.. ఏమాత్రం సంగీత జ్ఞానం లేని ఆమె చాలా సులువుగా .. అద్భుతంగా పాడింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ మహిళ అంత బాగా పాడిన ఆ వీడియో అటు యూ ట్యూబ్.. ఇటు వాట్సాప్ లో కొన్ని రోజుల పాటు వైరల్ అయింది.

తాజాగా ఆ వీడియో రెహ్మాన్ కంటపడగా వెంటనే ఆ వీడియోను పేస్ బుక్ లో షేర్ చేస్తూ, ఆమె గానం చాలా బాగుందని ఆయన కామెంట్ పెట్టాడు. ఓ మారుమూల గ్రామానికి చెందిన సాధారణ మహిళ పాడిన పాటకి రెహ్మాన్ ప్రశంసలు లభించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.        

More Telugu News