KCR: స్వయంగా బుజ్జగింపు... నాయినికి కేసీఆర్ పిలుపు!

  • ముషీరాబాద్ ఇవ్వలేమంటున్న టీఆర్ఎస్
  • ముఠా గోపాల్ కు ఇచ్చేందుకే కేసీఆర్ మొగ్గు
  • నాయినిని బుజ్జగించేందుకు స్వయంగా కేసీఆర్

ఈ ఉదయం తనను కలవాలని హోమ్ శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి, కేసీఆర్ నుంచి పిలుపు వెళ్లింది. ముషీరాబాద్ సీటును తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని ఆయన గత కొంతకాలంగా లాబీయింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సీటును ముఠా గోపాల్ కు ఇవ్వాలని భావిస్తున్న కేసీఆర్, నాయినికి సర్దిచెప్పేందుకే పిలిపించినట్టు సమాచారం. కొన్ని సమీకరణాల్లో భాగంగా ఆ సీటును వేరేవారికి ఇవ్వక తప్పడం లేదని, శ్రీనివాసరెడ్డికి మరో విధంగా అవకాశం ఇస్తామని కేసీఆర్ బుజ్జగించనున్నట్టు సమాచారం.

More Telugu News