telangana: ఎన్నికల సమయంలో మావోయిస్టు యాక్షన్ టీముల సంచారం.. నేతలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించిన పోలీసులు

  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టు యాక్షన్ టీముల కదలికలు
  • హిట్ లిస్టులో ఉన్న నేతలు అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు
  • రంగంలోకి దిగిన పోలీసు ప్రత్యేక బృందాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టు యాక్షన్ టీములు సంచరిస్తున్నాయని పోలీసు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోకి ఛత్తీస్ గఢ్ నుంచి మావోయిస్టులు ప్రవేశించారని సమాచారం.

భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లిలో మావోయిస్టు యాక్షన్ టీముల కదలికలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో, పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్న నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తమకు సమాచారం ఇవ్వకుండా మారుమూల గ్రామాలకు వెళ్లకూడదని తెలిపారు. మరోవైపు, మావోయిస్టు యాక్షన్ టీముల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు మొదలుపెట్టాయి.

More Telugu News