Hyderabad: హైదరాబాద్ సచివాలయం వద్ద కారు బీభత్సం!

  • వేగంగా వచ్చి అదుపు తప్పిన కారు
  • ముగ్గురు యువకులకు గాయాలు
  • మద్యం తాగి కారు నడపడమే ఘటనకు కారణమన్న పోలీసులు

హైదరాబాద్ సెక్రటేరియేట్ వద్ద ఈ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని, అవతలివైపు పల్టీ కొట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు యువకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆ యువకులు మద్యం మత్తులో ఉండటం, వేగంగా కారును నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, కారు నడిపిన యువకుడి రక్త నమూనాలను సేకరించి, పరీక్షకు పంపించామని తెలిపారు. ఈ ఘటనతో సచివాలయం, తెలుగుతల్లి విగ్రహం నుంచి నక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్ వరకూ ట్రాఫిక్ స్తంభించింది.

More Telugu News