Guntur: క్లాసు రూంలో సెంటు వాసన.. వీరంగమేసిన ఉపాధ్యాయుడు.. కేసు నమోదు!

  • క్లాసులో సెంటు వాసన వచ్చిందని ఆగ్రహం
  • ఎవరు పూసుకు వచ్చారో చెప్పాలని నిలదీత
  • చెప్పక పోవడంతో వాసన వచ్చిన వరుసలో కూర్చున్న వారందరిపై దాడి

క్లాసు రూంలో విద్యార్థులకు పాఠం చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పూనకం వచ్చినట్లు ఆగ్రహంతో ఊగిపోయాడు. సెంటు వాసన వచ్చిందన్న కోపంతో అనుమానం ఉన్న విద్యార్థులందరినీ చితకబాదాడు. ఓ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...గుంటూరు నగర శివారు నల్లపాడు లయోలా పాఠశాలలో నగరానికి చెందిన జావెద్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

తరగతి గదిలో గురువారం సెంటు వాసన వచ్చింది. పాఠం చెప్పేందుకు క్లాసుకు వచ్చిన ఉపాధ్యాయుడు బిట్టూ ఎవరు సెంటు పూసుకువచ్చారో చెప్పాలని నిలదీశాడు. విద్యార్థులు నోరు మెదపక పోవడంతో వాసన ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కునేందుకు తానే తరగతి గదిలో కలియ తిరిగాడు. జావెద్‌ కూర్చున్న చోట వాసన రావడంతో అతనితోపాటు అతని చుట్టుపక్కల కూర్చున్న మొత్తం పద్దెనిమిది మందిని చేతి కర్రతో చావబాదాడు.

ఒంటిపై పెద్ద పెద్ద వాతలు తేరి ఇంటికి వచ్చిన జావెద్‌ బాధతో విలవిల్లాడిపోతుండడం చూసిన అతని తండ్రి విషయంపై ఆరాతీశాడు. తాను చేయని తప్పుకు తనతోపాటు తన మిత్రులు 18 మందిని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టిన విషయాన్ని జావెద్‌ చెప్పి భోరుమన్నాడు. దీంతో ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News