mj akbar: నాపై ఆమె ఆరోపణలు అవాస్తవం.. అంగీకారంతోనే మా సంబంధం కొనసాగింది!: ఎంజే అక్బర్

  • వాషింగ్టన్ పోస్ట్ కు ఆమె రాసిన ఆర్టికల్ చదివా
  • ఆమెపై నేను అత్యాచారానికి పాల్పడ్డానన్నది అవాస్తవం 
  • పరస్పర అంగీకారంతోనే మా సంబంధం కొనసాగింది 

కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ తనను లైంగికంగా వేధించారని అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ, జర్నలిస్ట్ పల్లవి గొగొయ్ ఆరోపణలు చేశారు. వాషింగ్టన్ పోస్ట్ కు రాసిన ఓ వ్యాసంలో ఆమె ఈ ఆరోపణలు చేసింది. దీనిపై అక్బర్ స్పందిస్తూ.. ఆమె రాసిన ఆర్టికల్ ను తాను కూడా చదివానని చెప్పారు. ఆమెపై తాను అత్యాచారం చేసినట్టుగా ఆ కథనంలో ఆమె రాసిందని, ఇదంతా అవాస్తవమని, ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు.

అయితే, పరస్పర అంగీకారంతోనే తమ మధ్య సంబంధం కొనసాగిందని, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నానని చెప్పారు. 1994లో మొదలైన తమ సంబంధం కొన్ని నెలల పాటు మాత్రమే కొనసాగిందని, ఈ వ్యవహారంతో తన కుటుంబ జీవితం ఒడిదుడుకులకు గురవడంతో ఆ సంబంధం ముగిసిపోయిందని అక్బర్ పేర్కొన్నారు. 

More Telugu News