sukumar: సుకుమార్ కథలో హీరోగా నితిన్!

  • దర్శకుడిగా సుకుమార్ కి మంచి ఇమేజ్ 
  • గీతా ఆర్ట్స్ 2కి కథాకథనాలు 
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్

సుకుమార్ మంచి రచయిత .. అంతకు మించిన దర్శకుడు. ఇక ఈ మధ్యకాలంలో నిర్మాతగాను ప్రయోగాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. యూత్ కి నచ్చేలా కథాకథనాలను సిద్ధం చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలన్నీ ఈ విషయాన్ని నిరూపించినవే. ఆయన కథను అందించిన 'కుమారి 21 ఎఫ్' ఘన విజయాన్ని సాధించింది.

తాజాగా ఆయన మరో సినిమాకి కథాకథనాలను అందించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే బిజీగా వున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. 'కుమారి 21 ఎఫ్'ను తెరకెక్కించిన సూర్యప్రతాప్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాలో హీరోగా నితిన్ చేయనున్నాడు .. త్వరలోనే కథానాయిక ఎంపిక జరగనుంది. గోపీసుందర్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

More Telugu News