Cricket: భారత్ తో ఐదో వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

  • ఇప్పటికే 2-1 ఆధిక్యంతో కోహ్లీ సేన
  • సిరీస్ సమం చేయాలని విండీస్ పట్టు
  • మరికాసేపట్లో మ్యాచ్ మొదలు

భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఐదో వన్డేకు తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం సిద్ధమయింది. ఈ రోజు జరగనున్న ఐదో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు అంగీకరించింది. ఈ ఐదు వన్డేల సిరీస్ లో భారత జట్టు ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని విండీస్ జట్టు పట్టుదలతో ఉండగా, ఎలాగైనా సిరీస్ ను గెలవాలని కోహ్లీ సేన కృతనిశ్చయంతో ఉంది. మరికాసేపట్లో మ్యాచ్ మొదలుకానుంది.

More Telugu News