కాంగ్రెస్ తో కలసి వెళ్లడం సరైనదేనా?.. మంత్రుల ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇది!
- నాడు కాంగ్రెస్ పార్టీతో సమస్య కాబట్టి విభేదించాం
- నేడు బీజేపీతో అంతకన్నా పెద్ద సమస్య
- ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే పోరాడాల్సిందేనన్న చంద్రబాబు
దీనికి చంద్రబాబు సమాధానం ఇస్తూ, "టీడీపీని తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకే ఎన్టీఆర్ స్థాపించారు. అప్పట్లో కాంగ్రెస్ తో మాత్రమే సమస్య ఉండేది. నేడు బీజేపీతో అంతకు మించిన సమస్య ఏర్పడింది. తెలుగు వారికి అవమానం జరుగుతోంది. అణచివేస్తున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే తప్పులేదు. తెలుగు వారి ఆత్మగౌరవవానికి ఎవరి వల్ల ఇబ్బంది తలెత్తినా పోరాడాల్సిందే" అని అన్నారు.
కాగా, నేడు శరద్ నివాసంలో విందు భేటీ జరుగనుండగా, రాహుల్ గాంధీ అక్కడికే రానున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిగా ఆవిర్భవించి, ఇప్పటి నుంచే కలసి సాగాలన్నది చంద్రబాబు అభిమతం. ఈ పర్యటనలో ఫరూక్ అబ్దుల్లా, సీతారాం ఏచూరిలతో కూడా బాబు భేటీ కానున్నారు.