pune: మూడో వన్డే.. భారత్ విజయలక్ష్యం 284 పరుగులు

  • పూణే వేదికగా జరుగుతున్న మూడో వన్డే
  • విండీస్ స్కోర్: 283/9 (50 ఓవర్లలో)
  • బుమ్రా ఖాతాలో నాలుగు వికెట్లు 

పూణే వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయలక్ష్యం 284 పరుగులుగా వెస్టిండీస్ జట్టు నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 283 పరుగులు చేసి అన్ని వికెట్లు కోల్పోయింది.

వెస్టిండీస్ బ్యాటింగ్:

కేవో ఏ పావెల్ (21), హేమ్ రాజ్ (15), హోప్ (95), శామ్యూల్స్ (9), హెట్ మయర్ (37),ఆర్. పావెల్ (4), హోల్డర్ (32), అలెన్ (5), ఏఆర్ నర్స్ (40), రోచ్ 15 పరుగులతో, మెక్ కాయ్ సున్న పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

భారత్ బౌలింగ్ : 

భువనేశ్వర్ -1అహ్మద్-1, చాహల్ -1  బుమ్రా-4  కులదీప్ యాదవ్-2  

More Telugu News