nayini: ‘ఓటుకు నోటు’ కేసుపై నాయిని సంచలన వ్యాఖ్యలు

  • ‘ఓటుకు నోటు’ కేసులో చంద్రబాబు హస్తం
  • తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఆధారాలున్నాయి
  • కోదండరాం, ఉత్తమ్‌పైనా నాయిని విమర్శలు

తెలంగాణ హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రపన్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడి హస్తం ఉందని, అందుకు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఆధారాలున్నాయని అన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు అడుగడుగునా ప్రయత్నించారని, ఢిల్లీలో మంత్రాంగం నడిపారన్నారు.

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సిగ్గు, లజ్జా లేకుండా కాంగ్రెస్, తెలంగాణకు అడ్డుపడ్డ ద్రోహులతో చేతులు కలిపారని విమర్శించారు. ఆంధ్రా గడ్డమాయన, తెలంగాణ గడ్డమాయన ఎన్ని శక్తులొడ్డినా టీఆర్‌ఎస్‌ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో గురువారం జరిగిన టీఆర్‌ఎస్ మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News