శ్రీనివాసరావుపై ఐపీసీ 307 కింద కేసు నమోదు!

  • ఫిర్యాదు చేసిన సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్
  • ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
  • విచారణ జరుపుతున్నామన్న పోలీసులు
తమ అధీనంలో ఉన్న విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై, వీఐపీ లాంజ్ లో శ్రీనివాసరావు అనే ఎయిర్ పోర్టు క్యాంటీన్ ఉద్యోగి దాడికి పాల్పడ్డాడని సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ ఇచ్చన ఫిర్యాదు మేరకు ఎయిర్ పోర్టు పోలీసు స్టేషన్ కేసును రిజిస్టర్ చేసింది.

నిందితుడిని ఘటన వెంటనే అదుపులోకి తీసుకున్నామని ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ తరువాత, శ్రీనివాసరావుపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 (హత్యాయత్నం) ప్రకారం కేసును నమోదు చేసినట్టు పోలీస్ ఇనస్పెక్టర్ మల్లా శేషు వెల్లడించారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు. కాగా, ఎయిర్ పోర్టులోని ఓ కెఫెటేరియాలో వెయిటర్ గా ఉన్న శ్రీనివాసరావు, నిన్న జగన్ తో మాట్లాడుతూ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Vizag
Airport
Jagan
Srinivasa Rao

More Telugu News