kishan reddy: ముస్లిం రిజర్వేషన్ల రద్దుపైనే తొలి సంతకం: కిషన్ రెడ్డి

  • విద్య, ఉద్యోగాల్లో కల్పించే రిజర్వేషన్లను రద్దు చేస్తాం
  • రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను కేసీఆర్ మోసం చేస్తున్నారు
  • రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆ పార్టీ నేత కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లు రద్దుపైనే తొలి సంతకం చేస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలంలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. 

More Telugu News