ram gopal varma: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు మద్దతుగా వైసీపీ పోస్టర్లు

  • తిరుపతిలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర యూనిట్
  • ఈ సాయంత్రం శిల్పారామంలో కార్యక్రమం
  • సినిమాకు మద్దతుగా వెలసిన పోస్టర్లు

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, చిత్ర బృందం ఈరోజు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. తిరుపతిలోని శిల్పారామంలో ఈ సాయంత్రం సినిమాకు సంబంధించిన కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ సినిమాకు మద్దతు తెలుపుతూ వైసీపీ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో రామ్ గోపాల్ వర్మతో పాటు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా తదితరుల ఫొటోలను ముద్రించారు. ఈ పోస్టర్లు ఇప్పుడు తిరుపతిలో చర్చనీయాంశంగా మారాయి. 

More Telugu News