జగన్ ఓ రాక్షసుడు.. ఆ విషయంలో ఆయన్ను మించినవారు లేరు!: పరిటాల సునీత
- కోటి మంది డ్వాక్రా మహిళల్నిజగన్ అవమానించారు
- అసలైన మహిషాసురుడు ప్రతిపక్ష నేతే
- చంద్రబాబు హయాంలో భారీగా నిధులిచ్చాం
అసలు సిసలు మహిషాసురుడు జగనేనని.. అందుకే 2014 ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు మహిషాసుర మర్దన చేశారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లోనూ ‘జగనాసురుడి’ని మర్దించేందుకు ఏపీ మహిళలు మరోసారి సిద్ధమవుతున్నారని అన్నారు. పసుపు'-కుంకుమ పథకం అమలు తీరుతెన్నులపై చర్చకు సిద్ధంగా ఉన్నాననీ, ఇందుకు జగన్ సిద్ధమేనా? అని సవాలు విసిరారు.
పవిత్ర విజయదశమి పర్వదినాన జగన్ లాంటి రాక్షసుడి ప్రస్తావన తీసుకురావాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో డ్వాక్రా మహిళలకు కేవలం రూ.276 కోట్లు మాత్రమే ఇచ్చారనీ.. కానీ ఇప్పుడు చంద్రబాబు హయాంలో రూ.11,180 కోట్లు ఇవ్వడాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని మంత్రి దుయ్యబట్టారు.