పలాసకు వచ్చి చంద్రబాబుకు రూ. 66 లక్షల విరాళాన్ని అందజేసిన నారా బ్రాహ్మణి!
- తిత్లీ తుఫాను బాధితులకు సాయం
- ఇప్పటికే మజ్జిగ, పాలు పంచుతున్నామన్న బ్రాహ్మణి
- మరిన్ని స్వచ్ఛంద సంస్థలు సాయపడాలని వినతి
ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ, తుపాను ప్రభావిత ప్రాంతాలను తాను చూశానని, అక్కడి పరిస్థితిని చూసి చాలా బాధపడ్డానని అన్నారు. తనవంతు సాయంగా ఏమైనా చేయాలన్న ఉద్దేశంతోనే హెరిటేజ్ తరఫున ఈ సాయం చేశానని చెప్పారు. తమ సంస్థ ద్వారా మంచినీరు, మజ్జిగ, పాలు అందిస్తున్నామని, ఇతర సంస్థలు కూడా ముందుకొచ్చి తుపాను బాధితులను ఆదుకోవాలని బ్రాహ్మణి కోరారు.
ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు, బ్రాహ్మణిలకు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడులతో పాటు ప్రత్తిపాటి పుల్లారావు, కళా వెంకట్రావు, పలువురు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.