sudheer babu: ఆ ట్రైలర్ లో అది నా వాయిస్ కాదు .. స్పష్టం చేసిన సుధీర్ బాబు

  • విడుదలకి సిద్ధంగా 'వీర భోగ వసంత రాయలు'
  • తన పాత్రకి డబ్బింగ్ చెప్పని సుధీర్ బాబు 
  • కారణం ఏమిటనే దానిపై గుసగుసలు  

నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రీవిష్ణు .. శ్రియ ప్రధాన పాత్రదారులుగా 'వీర భోగ వసంత రాయలు' రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను వదిలారు. ఈ ట్రైలర్ లో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అయితే ఆయన పాత్రకి వేరెవరితోనో డబ్బింగ్ చెప్పించడం హాట్ టాపిక్ గా మారింది.

మొదటి నుంచి కూడా సుధీర్ బాబు తన పాత్రలకి తానే డబ్బింగ్ చెబుతూ వస్తున్నాడు. కానీ ఆయన ఈ సినిమాలో తన పాత్రకి డబ్బింగ్ చెప్పలేదు. వేరేవాళ్లు చెప్పిన డబ్బింగ్ ఆయనకి సెట్ కాలేదు. సుధీర్ బాబు మాత్రం కొన్ని కారణాల వలన ఈ సినిమాలో తన పాత్రకి తాను డబ్బింగ్ చెప్పలేదనీ, అది తన వాయిస్ కాదని స్పష్టం చేశాడు. సుధీర్ బాబు ఉద్దేశపూర్వకంగా డబ్బింగ్ చెప్పకపోవడం వల్లనే వేరేవాళ్లతో చెప్పించారని అర్థమవుతోంది. దాంతో ఈ విషయంలో ఏదో మతలబు ఉందనే గుసగుసలు జోరుగానే వినిపిస్తున్నాయి.   

More Telugu News