TRS: టీఆర్ఎస్ నేత పాయం వెంకటేశ్వర్లు ఇంట విషాదం.. అన్న సీతారాములు మృతి!

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
  • అన్న సీతారాములుకు గుండెపోటు
  • నివాళులు అర్పించిన టీఆర్ఎస్ నేతలు

టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇంట్లో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే సోదరుడు పాయం సీతారాములు గుండెపోటుతో ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు గుండెపోటు రాగా, కొద్దిసేపటికే పాయం సీతారాములు తుదిశ్వాస విడిచారు.

సీతారాములు మృతి విషయం తెలుసుకున్న తమ్ముడు వెంకటేశ్వర్లు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు. ఈ రోజు స్వగ్రామంలోనే అంత్యక్రియలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News