USA: స్నేహితుల వద్ద పడుకోమన్నాడు... నా బిడ్డ తట్టుకోలేకపోయింది: ఆత్మహత్య చేసుకున్న మాధురి తల్లి ఆరోపణ

  • బిడ్డ సుఖపడుతుందని అనుకుంటే నరకం చూపించాడు
  • ఫ్రెండ్సే తనకు ముఖ్యమని నాతోనే అన్నాడు
  • బోరున విలపించిన మాధురి తల్లి

అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడని, బిడ్డ సుఖపడుతుందని పెళ్లి చేసి పంపిస్తే, నిత్యమూ నరకం చూపించి తన బిడ్డను పొట్టన బెట్టుకున్నాడని, భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడిన మాధురి మృతదేహం ముందు ఆమె తల్లి బోరున విలపించింది. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, మందు కొట్టి, మత్తుమందులు వేసుకుని, తన స్నేహితుల పక్కన పడుకోవాలని మాధవి భర్త కోటేశ్వరరావు వేధించాడని, ఈ విషయం తనకు ఫోన్ లో చెప్పిన మాధురి బోరున విలపించిందని అన్నారు. ఇదే విషయాన్ని కోటేశ్వరరావు తనతోనే ధైర్యంగా ఫోన్ లో చెప్పాడని, అప్పుడే తన బిడ్డను తమ వద్దకు పంపించాలని వేడుకున్నానని ఆమె వాపోయింది.

"నీ కూతురు నాకు వద్దు... నా ఫ్రెండ్స్ కాడికి రానంటోంది. నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. నీ కూతురు నాకు వద్దు. మందు తాగేదానికి ఒప్పుకుంటేనే నీ కూతురు నాకాడ ఉంటది అన్నాడు. ఇద్దరూ కలసి రమ్మని చెప్పాను. వాడు రానన్నాడు. కనీసం అమ్మాయిని పంపించమని అడిగితే, టికెట్ కు డబ్బులెవడిస్తాడని అడిగాడు. నా బిడ్డకు టికెట్ బుక్ చేసుకోవడం చేతకాదని చెప్పింది. దణ్ణం పెట్టి అడిగాను. డబ్బులు నేను మీ అమ్మానాన్నలకు ఇస్తానని చెప్పాను" అని బోరున విలపిస్తూ చెప్పింది. కాగా, అమెరికాలో ఉన్న కోటేశ్వరరావును ఎలాగైనా ఇండియాకు రప్పించి అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News