Andhra Pradesh: అమరావతిలో జనసేన ప్రధాన కార్యాలయం.. ప్రారంభించిన పవన్ కల్యాణ్!

  • పవన్ ను వేదమంత్రాలతో స్వాగతించిన పురోహితులు
  • కార్యాలయంలో సర్వమత ప్రార్ధనలు
  • నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ రోజు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఉదయం 9 గంటల సమయంలో జనసేన కార్యాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కు పురోహితులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన మత పెద్దలు, పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు. తమ అభిమాన హీరో, నాయకుడి రాకతో అమరావతికి ఈ రోజు యువకులు, జనసేన కార్యకర్తలు పోటెత్తారు.

అనంతరం మనోహర్ తో పాటు పార్టీలోని ఇతర ముఖ్య నేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న ఐటీ దాడులు, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్షించారు. ఇకపై పార్టీ కార్యకలాపాలు అమరావతి కేంద్రంగా కొనసాగుతాయని ఈ సందర్భంగా పవన్ జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

More Telugu News