manohar parikar: ఓ వైపు అనారోగ్యం.. మరోవైపు ఆసుపత్రిలోనే కేబినెట్ మీటింగ్
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న ఆయన ఎయిమ్స్ లో చేరారు. ఈ నేపథ్యంలో, ఆసుపత్రి నుంచే పాలనా వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. తాజాగా కేబినెట్ మీటింగ్ కోసం మంత్రులంతా ఆసుపత్రికి రావాలని ఆయన ఆదేశించారు. ఎయిమ్స్ లో చేరిన తర్వాత ఆయన నిర్వహిస్తున్న తొలి కేబినెట్ సమావేశం ఇది. మరోవైపు తమ మిత్రపక్షాలైన ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీ నేతలతో కూడా ఆయన భేటీ కానున్నారు. మంత్రి పదవుల కేటాయింపులపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.