YSRCP vijayasaireddy: చంద్రబాబు అవినీతి సంపద రూ.5 లక్షల కోట్లు!: ఎంపీ విజయసాయిరెడ్డి తాజా ఆరోపణలు

  • ఈ మొత్తాన్ని విదేశాలకు తరలించేశారు
  • బాబు ప్రభుత్వం ఓ సామాజిక వర్గం సేవలో తరిస్తోంది
  • వైసీపీ ఎంపీ తీవ్ర ఆరోపణలు

తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు రూ.5 లక్షల కోట్ల తన అక్రమార్జనను విదేశాలకు తరలించేశారని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ రోజు ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఓ సామాజిక వర్గం సేవలో తరిస్తోందని ధ్వజమెత్తారు. పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.

More Telugu News