shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

  • ఎయిర్ ఇండియా ఉద్యోగి వద్ద 4.5 కిలోల బంగారం  
  • రూ.3.60 లక్షల నగదు కూడా  
  • ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. ఈరోజు ఎయిర్ పోర్ట్ లో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎయిర్ ఇండియా ఉద్యోగి నుంచి సుమారు 4.5 కిలోల బంగారం, రూ.3.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ ఇండియా ఉద్యోగిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సదరు ఎయిర్ ఇండియా ఉద్యోగి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఓ వ్యక్తి కోసం వెతుకుతున్న సమయంలో డీఆర్ఐ అధికారులు వలపన్ని అతన్ని పట్టుకున్నట్టు సమాచారం. అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద రెండు పార్శిల్స్ దొరికాయని, వాటిని ఓపెన్ చేసి చూడగా అందులో బంగారం బిస్కెట్లు ఉన్నట్టు కనుగొన్నారు. ఈ బంగారం పార్సిల్స్ ఎవరి నుంచి వచ్చాయి? వాటిని ఎక్కడికి డెలివరీ చేస్తున్నారనే కోణంలో అతన్ని అధికారులు విచారిస్తున్నారు. 

More Telugu News