assam: ఏనుగుపై ఊరేగిస్తుండగా జారి కిందపడ్డ అసోం అసెంబ్లీ స్పీకర్!

  • కరీంగంజ్ జిల్లాలోని రాతాబరిలో సంఘటన
  • కృపనాథ్ ను ఏనుగుపై ఊరేగించిన మద్దతుదారులు 
  • ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదన్న అనుచరులు

అసోం అసెంబ్లీ స్పీకర్ హోదాలో సొంత నియోజకవర్గానికి వెళ్లిన కృపనాథ్ మల్లాహ్ కు చేదు అనుభవం ఎదురైంది. కరీంగంజ్ జిల్లాలోని రాతాబరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కృపనాథ్ మల్లాహ్ గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ పదవి కూడా ఆయన్ని వరించింది.

ఈ సందర్భంగా కృపనాథ్ మల్లాహ్ తన నియోజకవర్గానికి వెళ్లారు. కృపనాథ్ మల్లాహ్ మద్దతుదారులు ఆయన్ని ఏనుగుపై ఊరేగిస్తూ తీసుకెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆయన ఏనుగుపై నుంచి జారి కిందపడ్డారు. వెంటనే స్పందించిన వ్యక్తిగత సిబ్బంది, అనుచరులు ఆయన వద్దకు వెళ్లారు ఈ సంఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని కృపనాథ్ అనుచరులు తెలిపారు.  

More Telugu News