araku: అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఇప్పుడు కాదు.. ఎన్నికల సంఘం స్పష్టీకరణ!

  • ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఈ ఉపఎన్నిక ఉండదు
  • ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్
  • ఎమ్మెల్యే కిడారిని ఇటీవల కాల్చి చంపిన మావోయిస్టులు

రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ కొద్ది సేపటి క్రితం వెలువడిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ తో పాటే ఏపీలోని అరకు అసెంబ్లీ నియోజకవర్గానికీ ఉపఎన్నిక జరగొచ్చని భావించారు. కానీ, ఆ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఇప్పుడు నిర్వహించట్లేదు. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ కొద్ది సేపటి క్రితం స్పష్టం చేశారు. కాగా, విశాఖపట్టణం జిల్లాలోని లివిటిపుట్టులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు ఇటీవల కాల్చి చంపారు.

More Telugu News